క్రైమ్/లీగల్

గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 16: రౌడీగ్యాంగ్‌ల మధ్య గొడవను ఆపుదామని నచ్చజెప్పేందుకు వెళ్లిన యువకుడిని రౌడీషీటర్ కత్తితో పొడిచిన హతమార్చిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనలో యువకుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయా లయ్యాయి. వివరాల ప్రకా రం.. రాజేంద్రనగర్ సర్కిల్ శాస్ర్తిపురంకు చెందిన మహ్మద్ ముస్తాక్ అదే ప్రాంతంలోని ఓ పాన్‌షాపు వద్ద స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో 10 మంది యువకులు గొడవ పడుతూ కనిపించారు.
ముస్తాక్ వెంటనే ఇరువర్గాల మధ్య గొడవ ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలపత్తర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ షానూర్ ఘాజీ తన వెంట తెచ్చుకున్న కత్తితో మహ్మద్ ముస్తాక్‌ను పొడిచాడు. మరో ముగ్గురు యువకులపై సైతం దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన మహ్మద్ ముస్తాక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. పేకాట ఆడుతున్న యువకులను షానూర్ గ్యాంగ్ డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో గొడవ ప్రారంభమైందని డీసీపీ ప్రకాష్ తెలిపారు. షానూర్ గతంలో హత్యకేసులో నిందితుడని, అతనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.