హైదరాబాద్

శ్రీలంకలో బాంబు దాడి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రపంచ శాంతి కోసం నిత్యం ప్రార్థనలు చేసే క్రైస్తవులపై బాంబులతో దాడి చేయడం అమానుషమని ఆల్ క్రిస్టియన్స్ వెల్ఫేర్ సెంటర్ పేర్కొంది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సెంటర్ ప్రతినిధులు సాల్‌మన్ రాజ్, కృపానందం, హనక్ మాట్లాడారు. క్రైస్తవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈస్టర్ పండుగ రోజున వరస బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమని అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించే వారి పట్ల జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.