హైదరాబాద్

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 22: రాబోయే ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని ప్రముఖ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత మేరికోమ్ తెలిపింది. మేరికోమ్‌ను కంట్రీక్లబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కెరీర్ మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, కుటుంబ సభ్యులను మెప్పించేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తన భర్త పూర్తిసహకారం అందించడం వల్లే అద్భుతంగా రాణించగలుగుతున్నానని తెలిపింది. దేశ, విదేశాల్లో ఎంతోమంది సభ్యులు కలిగిన కంట్రీక్లబ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది.
సిఎండి రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ బాక్సింగ్‌లో అర్జున అవార్డును అందుకొని ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మేరికోమ్ తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ మణిశంకర్, వరుణ్ రెడ్డిలతో పాటు క్లబ్ సిబ్బంది పాల్గొన్నారు.