హైదరాబాద్

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, ఏప్రిల్ 30: తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తార్నాక డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి పేర్కొన్నారు.
శనివారం డివిజన్‌లో వితంతు ఫించన్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేవలం అభివృద్ధిలో మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని అన్నారు. దేశంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఫించన్లను అర్హులైన పేదలకు అందజేస్తూ వారి జీవితాల్లో కొత్తవెలుగులు నింపిన సిఎం కెసిఆర్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారని అన్నారు.
బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి తెరాస ప్రభుత్వం సిఎం కెసిఆర్ సారధ్యంలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కెసిఆర్‌కు మించి ఎవరు లేరని సరస్వతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షుడు ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.