హైదరాబాద్

కరవుపై నివేదిక ఇస్తే సహాయం అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువుపై సమగ్ర నివేదిక పంపిస్తే కేంద్రం నుంచి సహాయం అందిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.385 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. హరే కృష్ణా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరై తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ హరేకృష్ణ ఫౌండేషన్ కేవలం రూ.5కే 500 కేంద్రాలలో భోజనాన్ని సరఫరా చేస్తుండటం అభినందనీయమని అన్నారు. కానీ నగరంలో భోజనం ధరతో సమానంగా మంచినీటి ధర ఉందని చెప్పారు. లక్ష్మణ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.