రంగారెడ్డి

మేడ్చల్‌ను జిల్లాగా కోరుతూ రిలే నిరాహార దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 12: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న 15 జిల్లాలలో మేడ్చల్ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలకు జడ్పీటిసి శైలజ, మండల బిజెపి అధ్యక్షుడు గౌరారం జగన్‌గౌడ్ తదితర నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి మేడ్చల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సకల సౌకర్యాలతో తూలతూగుతున్న మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడం వలన అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దిగి వచ్చి మేడ్చల్ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించే దాకా వివిధ రూపాల్లో తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. జిల్లా సాధనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. దీక్షలో నాయకులు సుధాకర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, రాగజ్యోతి, ధన్‌రాజ్ నాయక్ పాల్గొన్నారు.