హైదరాబాద్
2019 నాటికి పైపులైన్ ద్వారా జంట నగరాలకు గ్యాస్: దత్తాత్రేయ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 May 2016
హైదరాబాద్, మే 14: జంట నగరాలకు 2019 సంవత్సరంలోగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందజేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన పెట్రోలియం ఉన్నతాధికారులతో సమావేశమై ఉజ్వల పథకం విస్తరణపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో కొత్తగా 4.73 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 3.5 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు.