చిత్తూరు

ప్రజలు వైకాపా వెంటే ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ఆంధ్రరాష్ట్ర ప్రజలను వంచించి మోసం చేశాయని వారిపై కసి తీర్చుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం వైకాపాదేనని ఆపార్టీ రాప్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నగరంలో వార్డుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిన నాయకులు స్థానిక 27వ వార్డు పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వార్డు అధ్యక్షులుగా చింతారమేష్, ప్రధానకార్యదర్శిగా చింతాభరణి యాదవ్, మహిళ కార్యదర్శిగా గీతతోపాటు మరో 37మందితో కమిటీని ఏర్పాటుచేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మొండి చేయి చూపించారని, ఆవిషయాన్ని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదన్నారు. ఓటుకు నోటు కేసులో తనను కేంద్రం జైలుకి పంపిస్తుందన్న భయం బాబులో ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రజల పక్షాన వైకాపా అధినేత జగన్ పోరాటాలు చేస్తుంటే దానిని కూడా అడ్డుకోవడానికి బాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, పోలీసులతో అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడివున్న వైకాపా కార్యకర్త కూడా ప్రభుత్వ కుట్రలకు భయపడరనే సత్యాన్ని బాబు గుర్తించాలన్నారు. ఏదేమైనా త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 డివిజన్లలో వైకాపా అభ్యర్థులను గెలిపించి టిడిపికి బుద్ధి చెప్పేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాలగిరి ప్రతాపరెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, రాజేంద్ర, హనుమంతనాయక్, పుల్లయ్య, సయ్యద్, దుద్దేలబాబు, వెంకటేష్, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, బాబుయాదవ్, ముద్రనారాయణ, కుసుమ, సాయికుమారి, సునీత, గీతాయదవ్ పాల్గొన్నారు.