ఐడియా

తాజా చర్మం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణంలో మార్పులు కారణంగా చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. అలాకాకుండా ముఖం ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఈ వానాకాలంలో పెసరపిండి వాడాలి. పెసరపిండి వాడటం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం ఎంతో అందంగా ఉంటుంది.
* అరకప్పు పెసరపిండిని తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల కీరా జూస్, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని నెమ్మదిగా కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై పొల్యూషన్ వల్లకానీ, వాతావరణ మార్పుల వల్ల కానీ ఏర్పడిన పిగ్మెంటేషన్ దూరమై చర్మం ఎంతో కాంతులీనుతుంది.
* రెండు స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా పాలు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగేయడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోయి ముఖం తాజాగా ఉంటుంది.
* అరకప్పు పెసరపిండిలో రెండు సూన్ల పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడగడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా, కాంతులీనుతూ ఉంటుంది.