ఖమ్మం

మందుపాతర పేలి జవాన్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 7: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. 199 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్ ప్రదీప్‌కుమార్ తన పార్టీతో కలిసి బైరంగఢ్‌లోని తమ క్యాంపు నుంచి 4 కి.మీల దూరంలోని పుండరీ ఆలయం వద్దకు నీళ్లకోసం వెళ్లాడు. అదే సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. దీంతో ప్రదీప్‌కుమార్‌కు గాయాలవ్వగా బైరంగఢ్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందించి అనంతరం హెలీకాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. కాగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో 39 మంది మావోయిస్టు సానుభూతిపరులు సోమవారం లొంగిపోయారు. వీరిలో 7గురు సాయుధ మిలీషియా సభ్యులు కాగా, 12 మంది గ్రామకమిటీ సభ్యులు ఉన్నారు. వీరంతా టేముడుపల్లి గ్రామస్థులు. రెండు రోజుల క్రితమే 140 మంది వరకు ఇదే పోలీసుస్టేషన్‌లో మావోయిస్టు సానుభూతిపరులు లొంగిన సంగతి విదితమే.