అంతర్జాతీయం

పాక్‌లో రెండు బస్సులు ఢీ 30 మంది మృతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 17: పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో 30 మంది చనిపోగా, 55 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫైసలాబాద్ నుంచి బహవాల్‌పూర్, కరాచి నుంచి రహీమ్ యార్ ఖాన్ వెళ్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి వేగంతోపాటు వాతావరణ పరిస్థితి కూడా తోడైవుంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని ఖాన్‌పూర్, రహీమ్ యార్ ఖాన్ ఆసుపత్రులకు తరలించారు. బస్సుల్లో మృతదేహాలు చిక్కుకుపోవడంతో గ్యాస్‌కట్టర్ల సహాయంతో రంధ్రాలు చేసి మృతదేహాలను వెలికితీయాల్సి వచ్చిందని సహాయక సిబ్బంది తెలిపారు.