అంతర్జాతీయం
రోహింగ్యా పిల్లలకోసం ప్రత్యేకంగా శిబిరాలు: బంగ్లా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 27 September 2017
ఢాకా, సెప్టెంబర్ 26: మైన్మార్లో రోహింగ్యా మైనారిటీలపై జరుగుతున్న దారుణాలనుంచి తప్పించుకుని దాదాపు 6వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి బంగ్లాదేశ్కు చేరుకున్నారు. వారికోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మంత్రి నురుజ్జామన్ అహ్మద్ తెలిపారు. అందుకోసం అన్ని సౌకర్యాలతో భవనాన్ని నిర్మించేందుకు 200 ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. అయితే యునిసిఫ్ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్కు తరలివచ్చిన పిల్లలు 1800 కాగా, బంగ్లాదేశ్ మాత్రం 6వేల మంది వచ్చారని చెబుతోంది.