అంతర్జాతీయం

బతికున్న మనిషికి సంతాపం ప్రకటించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన మదన్‌లాల్ ఖోస్లా అనే వ్యక్తిని బతికి ఉండగానే అధికారులు పొరపాటున చనిపోయినట్లుగా ప్రకటించారు. మాంచెస్టర్‌కు చెందిన ఖోస్లా తనకు వచ్చిన ఒక లేఖను తెరచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక కౌన్సిల్ నుంచి వచ్చిన ఆ లేఖలో తన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఉంది. దీంతో అతను తాను చనిపోలేదని, బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి తన పాస్‌పోర్టును తీసుకొని వెళ్లి ఓ జాబ్ సెంటర్‌లో రిపోర్ట్ చేయవలసి వచ్చింది. ‘ఒకవేళ నేను బయటకు వెళ్లిపోయి ఉండి, వేరే ఎవరయినా ఆ లేఖను తెరచి చూస్తే నేను చనిపోయాననే వారు భావించేవారు. ఆ లేఖను చూడగానే నన్ను నేను గిల్లి చూసుకోవలసి వచ్చింది’ అని 83 ఏళ్ల కోస్లా ‘మాంచెస్టర్ ఈవ్‌నింగ్ న్యూస్’కు చెప్పారు.