అంతర్జాతీయం

జననేత మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 15: భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడుని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే జనాదరణలో మోదీ 30 పాయింట్లు అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కంటే 31 పాయింట్లు అధికంగా ఉన్నారని ప్యూ సంస్థ జరిపిన ఈ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 2,464 మంది అభిప్రాయాలను సేకరించారు. 80 శాతం మంది మోదీదే తిరుగులేని జనాదరణ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్‌కు 58 శాతం, సోనియాకు 57 శాతం, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు 39 శాతం మంది మద్దతు తెలిపారు.నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో సానుకూల భావనే వ్యక్తమైందని ముఖ్యంగా ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. మొత్తమీద దేశ ఆర్థిక వ్యవస్థలో అంతా సవ్యంగానే సాగుతుందని ప్రతి పది మందిలోఏడుగురు భారతీయులు అభిప్రాయపడ్డారు.