అంతర్జాతీయం

లండన్ విమానం రద్దు ప్రయాణికుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం రద్దయింది. దీంతో లండన్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇటీవల శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోపే సాంకేతిక లోపంతో వెనుదిరిగి ల్యాండ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే. కాగా సోమవారం లండన్ నుంచి శంషాబాద్ రావాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం రాకపోవడంతో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ అధికారులు సదరు విమానాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో లండన్ బయలుదేరాల్సిన 250 మంది ప్రయాణికులు హైరానా పడ్డారు. విమానాశ్రయంలో పడిగాపులు కాస్తూ ఆందోళనకు దిగిన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు నోవాటెల్ హోటల్‌లో తాత్కాలిక బస ఏర్పాటు చేశారు.