అంతర్జాతీయం

నేడు భారత్‌కు శ్రీదేవి పార్థివ దేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఫిబ్రవరి 25: శనివారం రాత్రి గుండెపోటుతో దుబాయలో మరణించిన ప్రఖ్యాత నటి శ్రీదేవి భౌతిక కాయానికి అటాప్సీ పూర్తయిందని, అయతే సోమవారం ఆమె పార్థివ శరీరాన్ని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకు వస్తున్నట్టు మీడియా కధనాలను బట్టి స్పష్టం అవుతోంది.
ఫోరెన్సిక్ విభాగం నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించిన లేబరేటరీ నివేదికలను అమె కుటుంబ సభ్యులకు అందించిన తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తారని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. నిజానికి ఆదివారం రాత్రే ఆమె భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించాల్సి ఉన్నప్పటికీ దుబాయి పోలీసుల తుది దర్యాప్తు నివేదికలు అందకపోవడం వల్ల ఈ నిర్ణయం వాయిదా పడింది.