అంతర్జాతీయం

హిందువునని తెలిసి వివక్ష చూపిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, జూలై 2: తాను పనిచేసే వివక్షను ఎదుర్కొంటున్నానని, గతంలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని తన పై అధికారి ఇప్పుడు తనపై ఒత్తిడి తెస్తున్నారని పాకిస్తాన్ అధికార వార్తాసంస్థ ‘అసోసియేట్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్’(ఎపిపి)లో పనిచేస్తున్న ఓ హిందూ రిపోర్టర్ ఫిర్యాదు చేస్తున్నారు. తాను ముస్లిం కాదు, హిందువునని, అది కూడా ఓ దళితుడినని గత మేలో బ్యూరోచీఫ్, ఇతర సహ ఉద్యోగులకు తెలిసిందని, అప్పటినుంచి పరిస్థితిలో తీవ్రమైన మార్పు వచ్చిందని ఎపిపిలో రిపోర్టర్‌గా పని చేస్తున్న సాహిబ్ ఖాన్ ఓద్ కరాచీనుంచి ఓ వార్తాసంస్థతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. అఫీసులో భోజనం చేసేటప్పుడు వేరే పాత్రలు ఉపయోగించాలని బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లామ్ తనను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ‘నేను ఖాన్‌నే కానీ ముస్లింను కాదు’ అని ఆయన చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలన్నీ అబద్ధాలని చెప్పాలని బ్యూరోచీఫ్ తనపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆయన చెప్పారు. అయితే ఓధ్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఎపిపి కరాచీ బ్యూరోచీఫ్ అస్లామ్ అంటున్నారు.