అంతర్జాతీయం

ఉగ్రదాడి జరిగితే భారత్ ఊరుకోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: భారత్ తన భూభాగంపై ఉగ్రవాద దాడు లు జరిగితే చూస్తూ ఊరుకోబోదని, ఆ దాడులకు తగిన విధంగా బదులిస్తుందని అమెరికాలోని భారత రాయబారి హర్శ్‌వర్ధన్ శ్రీంగాల తెలిపారు. గ్రేటర్ వాషింగ్టన్ ఏరియాలోని వివిధ యూనవర్శిటీలకు చెందిన భారతీయ విద్యార్థులతో ఆయన ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయాలన్న, వాటి స్థావరాలను తొలగించాలన్న అంతర్జాతీయ నియమాలను అమలు చేయవలసిన అవసరం ఉందని అన్నారు.