అంతర్జాతీయం

ఆ బాధ మాకు తెలుసు: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: ఉగ్రవాదం సమస్యను తమ దేశం స్వయంగా ఎదుర్కొంటున్నదని, అందుకే ఈస్టర్ రోజున జరిగిన దాడి కారణంగా ఎంతగా బాధపడుతున్నారనేది తమకు తెలుసునని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘెకు ఫోన్ చేసి, దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకళించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదానికి మతంగానీ, ప్రాంతంగానీ ఉండవని అన్నారు. ఇలాంటి దాడులను పాకిస్తాన్ ఖండిస్తుందని స్పష్టం చేశారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబీకులకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.