అంతర్జాతీయం
మాకేం నష్టం లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 May 2019
ఐక్యరాజ్యసమితి, మే 4: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల తమ దేశానికి వచ్చిన నష్టమేమీ లేదని ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ స్పష్టం చేశారు. ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల ప్రపంచ దేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న వాదనలను ఆయన ఖండించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఇకముందు కూడా ప్రోత్సహించబోదని ఆయన స్పష్టం చేశారు.