అంతర్జాతీయం

పాక్‌లో రెచ్చిపోయిన మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 6: అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడడంతో పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ సంఘటనపై స్పందించిన పాక్ ప్రభుత్వం సరిహద్దుల్లో మిలిటెంట్లను మట్టుబట్టాలని అఫ్గాన్‌ను అభ్యర్థించింది. ఉగ్రవాదులు మూడు మిలిటరీ పోస్టులపై కాల్పులకు తెగబడ్డారని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ విలేఖరులకు తెలిపారు. ఈ సంఘటనలో ఆరుగురు సైనికులు మరణించారని, అందుకు ప్రతిగా సైనికులు జరిపిన కాల్పుల్లో పదిమంది మిలిటెంట్లు మరణించి ఉంటారని భావిస్తున్నామని ఆయన తెలిపారు.