అంతర్జాతీయం

సిరియా మసీదుపై వైమానిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరూట్, మార్చి 17:ఉత్తర సిరియాలోని అలెప్పో రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన వైమానిక దాడుల్లో 42మంది దుర్మరణం చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది పౌరులేనని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. గుర్తు తెలియని కొన్ని యుద్ధ విమానాలే ఈ దాడులకు పాల్పడ్డాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అధినేత రామి అబ్దెల్ రహ్‌మాన్ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో మసీదు కుప్పకూలిందని, దాని శిథిలాల్లో అనేక మంది చిక్కుకు పోయారని కూడా ఆయన వెల్లడించారు. దాడుల తీవ్రతకు మృతుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయని, ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైందని చెప్పారు.

చిత్రం..సిరియాలోని దాడులు జరిగిన ప్రాంతం