అంతర్జాతీయం

20 మంది జల సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్ (మయన్మార్), ఏప్రిల్ 8: మయన్మార్‌లో ఒక పడవ మరో పడవను ఢీకొనడంతో 20 మంది జల సమాధి అయ్యారు. మృతుల్లో 16 మంది మహిళలు, మరో నలుగురు పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు. వివాహానికి వచ్చిన పలువురు అతిథులు ఇళ్లకు తిరిగి పయనమై ‘సిల్వర్ స్టార్’ అనే పడవలో వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో దాదాపు 60 మంది ఆ పడవలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగవచ్చని భావిస్తున్నామని స్ధానిక పోలీసులు వివరించారు.