అంతర్జాతీయం

సిరియా శరణార్థి శిబిరంపై ఐసిస్ ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, మే 2: సిరియా శరణార్థ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32మంది పౌరులు మరణించారు. మూడొందల కుటుంబాలు నివసిస్తున్న ఈ తాత్కాలిక శిబిరంపై మంగళవారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈశాన్య సిరియాలో ఎస్‌డిఎఫ్ ఆధీనంలో ఉన్న హసాకే పట్టణంలోకి ప్రవేశించేందుకు వీలుగా వీరికి ఈ శిబిరంలో ఆశ్రయం కల్పించారు. ఈ శిబిరంలోపలా, వెలుపలా మొత్తం ఐదుసార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయని సిరియా మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ దాడి జరిగిన వెంటనే ఐసిస్-ఎస్‌డిఎఫ్ దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయని, మృతుల్లో 21మంది సిరియా లేదా ఇరాక్ శరణార్థు తెలిపింది. గాయపడిన 30మందిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టూ వెల్లడించింది.