అంతర్జాతీయం

అన్నదాతలపై భారం మోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 9: అన్నదాతల వ్యవసాయ రాబడిపై పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అంతేకాదు సంపన్న రైతులనేవారు చాలా అరుదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉందని, అందువల్ల వ్యవసాయాదాయంపై పన్ను విధించే ప్రశే్న లేదని జైట్లీ పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మిగతా పౌరుల మాదిరిగా రైతులపై కూడా పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్‌రాయ్ గత నెల చేసిన ప్రకటన పెద్ద దుమారానే్న సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను తాను ఇప్పటికే వ్యతిరేకించానని, రైతులపై పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంగా చెప్పానని జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉందని, వ్యవసాయ కమతాలు కూడా చాలా చిన్నవేనని ఆయన అన్నారు. సంపన్న రైతులు అనేవారు చాలా అరుదని, అందువల్ల వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిన సమయంలో దానిపై పన్ను విధించడం సరికాదని అన్నారు. రైతులకు సాయం చేయాలే తప్పితే పన్ను వేయరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదిఏమయినా వ్యవసాయాదాయంపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. వ్యవసాయాదాయంపై పన్ను విధించడంపై బిబేక్ దేబ్‌రాయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, ప్రభుత్వం ఆలోచన కాదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా కూడా చెప్పడం తెలిసిందే.
మొండి బకాయిల వసూలు రుణ గ్రహీతలపై చర్యలు తీసుకోవడానికి, మొండి బకాయిల వసూలుకు బ్యాంకులకు సలహా ఇవ్వడానికి కమిటీలను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంకుకు అధికారాలు కల్పిస్తూ గత వారం జారీ చేసిన ఆర్డినెన్స్ గురించి అడగ్గా, నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారానికి సమయం పడుతుందని, అయితే బ్యాంకులు ఇప్పుడు వాటి వసూలుకు చర్యలను వేగవంతం చేశాయని జైట్లీ చెప్పారు. ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని, ఆర్‌బిఐ సైతం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించిందని, మేనేజిమెంట్‌కు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయని తెలిపారు. జాయింట్ లెండింగ్ ఫోరమ్ (జెఎల్‌ఎఫ్) వ్యవస్థద్వారా మొండి బకాయిల వసూళ్లు ప్రారంభమవడం తదుపరి చర్య అని ఆయన అంటూ, వీటి ఏర్పాటుకు బ్యాంకులు సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. మొండి బకాయిలను ప్రారంభ దశలోనే గుర్తించి 45 రోజుల్లోనే సమస్యను సరిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించడానికి 2014లోనే ఈ జెఎల్‌ఎఫ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. అయితే వ్యక్తిగత ఖాతాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై బ్యాంకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఇది సక్రమంగా పని చేయలేదు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల సమస్యలన్నీ తీరిపోయి, వాటి పరిస్థితి మెరుగుపడినప్పుడు మాత్రమే ప్రభుత్వం వాటిలో వాటాలను తగ్గించుకుంటుందని జైట్లీ స్పష్టం చేశారు. మార్కెట్‌కు వెళ్లేందుకు ఇది తగిన సమయం కాదని, ముందు వాటి పరిస్థితిని మెరుగుపరచాక ఆ పని చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి మరిన్ని కన్సాలిడేషన్ కేసులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన అన్నారు. అయితే వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.