అంతర్జాతీయం

కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్‌కు సమన్లు జారీచేసిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 11: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ మేరకు ఇక్కడి ఇండియన్ డిప్యూటీ హైకమిషనర్ (డిహెచ్‌సి) జెపి సింగ్‌కు సమన్లు అందజేశారు. పాక్ విదేశాంగశాఖ (ఎస్‌ఎ, సార్క్) డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఫైజల్ డిహెచ్‌సిని కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని టండర్, సబ్‌కోట్, ఖ్యురట్టా, బరోహ్, బగ్సర్, ఖంజార్ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ సైన్యం కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మగ్గురు గాయపడ్డారని ఫైజల్ ధ్వజమెత్తారు. మంగళ, బుధవారాల్లో భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాకుండా కాల్పులకు దిగినట్టు ఆయన పేర్కొన్నారు. భారత్ చర్య అంతర్జాతీయ మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధమని సమన్లలో స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పాక్ విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.