జాతీయ వార్తలు

అదృశ్యమైన ఆ 13 మంది ఐసిస్‌లో చేరారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలోని కాసరగోడ్ జిల్లాలో నెల రోజుల క్రితం అదృశ్యమైన 13 మంది ముస్లిం మతస్థులు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉద్రవాద సంస్థలో చేరారన్న అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. అదృశ్యమైన వారిలో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మేం అనుకున్న గమ్యానికి చేరాం..’ అంటూ వీరి నుంచి సెల్‌ఫోన్‌లో మెసేజీలు రావడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన 13 మంది పూర్వపరాల గురించి కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. వీరు శ్రీలంక మీదుగా ఇస్లామిక్ దేశాలకు చేరుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.