ఆంధ్రప్రదేశ్‌

ఇసుకపెళ్లలు పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఇసుక పెళ్లలు విరిగిపడడంతో ఊపిరాడక ఇద్దరు కూలీలు మరణించిన ఘటన చింతలపూడి మండలం తమ్మిలేరువాగులో సోమవారం జరిగింది. ఇసుక తవ్వేందుకు కొందరు కూలీలు వాగు వద్దకు వెళ్లారు. అయితే, అక్కడ ఇంతకుముందే కొందరు ఇసుక తవ్వడంతో గోతులు ఏర్పడ్డాయి. ఒక గొయ్యిలో దిగి ఇసుకను తీస్తుండగా పైనుంచి పెళ్లలు విరిగిపడడంతో ఊపిరాడక లక్ష్మీనారాయణ, నరేష్ అనే కూలీలు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.