ఆంధ్రప్రదేశ్
అనవసర చర్చలతో సభా సమయం వృథా:సీఎం జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 July 2019
అమరావతి: విపక్షాలు అనవసర చర్చలతో సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఈరోజు ప్రారంభమైన శాసనసభా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టొని భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తున్నామని తాము ఒక పక్క చెబుతున్నామని, కాని విపక్షాలు తమపై విమర్శలు చేయటం తగదని అన్నారు. సభ ప్రారంభమై గంటసేపైనా ఇప్పటి వరకు మూడు ప్రశ్నలకే సమాధానం చెప్పగలిగామని, మిగిలిన వాటికి కూడా సభ్యులు సహకరించాలని కోరారు. కాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మైక్ ఇవ్వటం లేదని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదని వారు నినాదాలు చేశారు. స్పీకర్ అంగీకరించక పోవటంతో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.