జాతీయ వార్తలు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బాబు: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
దిల్లీ: భారీగా డబ్బు లేదా మంత్రి పదవులను ఎరగా వేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ‘సేవ్ డమొక్రసీ’ యాత్ర సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ పలువురు రాజకీయ నేతలను కలిసి ఎపిలో ఫిరాయింపురాజకీయాలపై ఫిర్యాదు చేశారు. బాబుకు దమ్ముంటే టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికల్లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. బాబు అవినీతికి సంబంధించి తమ పార్టీ ప్రచురించిన పుస్తకాలను జగన్ పలువురు నేతలకు పంచిపెట్టారు. ఫిరాయింపుల బాగోతంపై రాష్టప్రతి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.