ఆంధ్రప్రదేశ్‌

దిగువ రాష్ట్రాల సంగతేంటి?:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: నదులపై ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారం ప్రాజెక్టులను కడితే దిగువ రాష్ట్రాల పరిస్థితి ఏమిటని వైకాపా అధినేత జగన్ ప్రశ్నించారు. ఇక్కడ మూడు రోజులుగా చేస్తున్న జలదీక్షను ఆయన బుధవారం మధ్యాహ్నం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదులపై మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్నందున ఎపి రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. నీటి వాటా ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. కెసిఆర్‌కు, మోదీకి భయపడుతున్న సిఎం చంద్రబాబు అక్రమ ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం లేదన్నారు.