ఆంధ్రప్రదేశ్
జనం కోసం అలుపెరుగని పోరాటం: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 June 2016
విజయవాడ: ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని వైకాపా అధినేత జగన్ అన్నారు. ఇక్కడ మంగళవారం ప్రారంభమైన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎపిలో చంద్రబాబు రెండేళ్ల పాలనలో అవకతవకలను ప్రజలకు వివరిస్తామన్నారు. గ్రామగ్రామాన ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు రాబోయే మూడేళ్ల కాలంలో మరింత కృషి జరగాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రజలకు అండగా నిలవాలన్నదే పార్టీ సిద్ధాంతమన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. కాగా, కొందరు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ సమావేశానికి గైర్హాజరు కావడం గమనార్హం.