జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో హైఅలర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడికి పాల్పడేందుకు లష్కరే తోయిబా భారీ కుట్రకు వ్యహారచన చేసిందని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్రంలో భద్రతాచర్యలను కట్టుదిట్టం చేశారు. బుఖారీ హత్యకేసులో నిందితులైన నవీద్ జట్, ఆజాద్ అహ్మద్ మాలిక్ ఇద్దరూ కూడా కలిసే ఉన్నారని ఇంటలిజెన్స్ అధికారులు వెల్లడించారు. వీరు గత ఏడాది కూడా అమరనాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని, అలాగే ఈసారి కూడా కుట్రకు పథక రచన చేసినట్లు వెల్లడించారు. కాశ్మీర్‌కు చెందిన కొందరు యువకులు పాకిస్థాన్‌కు వెళ్లికి శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే భద్రతాదళాలు వద్ద ఆయుధాలు దొంగిలించి దాడికి సిద్ధమైనట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.