జాతీయ వార్తలు
పోలీస్ అధికారులతో జయలలిత భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 June 2016
చెన్నై: శాంతి భద్రతలపై ప్రజల్లో నమ్మకం సడలిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆమె మంగళవారం పోలీస్ బాస్లతో సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై ఆరా తీశారు. చెన్నైలోని సుగంబాకం రైల్వే స్టేషన్లో అయిదురోజుల క్రితం పట్టపగలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వాతిని ఓ ఆగంతకుడు హత్యచేసిన ఘటనపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో జయలలిత నష్టనివారణ చర్యలకు దిగారు. మహిళలకు భద్రత విషయంలో భరోసా కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.