రాష్ట్రీయం

సమస్యలు పట్టని ప్రజాప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెసి ధ్వజం

ఉరవకొండ, డిసెంబర్ 28: ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రజల సమస్యలపై చర్చించకుండా కాకులు, కుక్కల్లా పోట్లాడుకుంటున్నారని ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నికల్లో ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించి అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపితే అక్కడ వారు ప్రజా సమస్యలను చర్చించకుండా సభ్యత, సంస్కారం మరచి కాకులు, కుక్కల్లా తెగబడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారన్నారు. తమ సమస్యలను పరిష్కరించని ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రజలకు అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని నేరుగా ప్రజలు ఎన్నుకుంటే అప్పుడైనా దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలు, పట్టాణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిలదీయాలని ఆయన ప్రజలకు సూచించారు.