రాష్ట్రీయం

నీళ్లొద్దంటే నీవెట్టా సిఎం అవుతావ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్‌పై జెసి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం, డిసెంబర్ 29:‘మావాడుడొకడున్నాడు.. పొట్టేగాడు.. జిల్లాకు నీళ్లొద్దంటాడు... ప్రతిదానికి అడ్డుపడుతుంటాడు.. నీయబ్బా నీళ్లొద్దంటే నీవెట్టా సిఎం అవుతావు’ అంటూ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతపురంలో మంగళవారం జరిగిన నీరు-ప్రగతి సభలో దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్క ప్రకాశం గురించి తప్పించి అందరు ముఖ్యమంత్రులూ తనకు తెలుసునన్నారు. అయితే ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహనరెడ్డికి ఏమి ఖర్మ పట్టిందో తెలీడం లేదన్నారు. నీళ్లు వద్దంటే నీవు ముఖ్యమంత్రి అవుతావా అని జగన్‌ను ప్రశ్నించారు. మంచిపనులు చేస్తేనే ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని, అప్పుడే ముఖ్యమంత్రివి అవుతావని ఆయన స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం దాహార్తి తీర్చాలని కోరారు. పోలవరం పూర్తి చేయాలన్నదే ఆయన కల అని అన్నారు. ఇప్పుడు నికరజలం అన్నదే లేదని ఉన్న నీటిని వాడుకోవడమే నికర జలమని కొత్త భాష్యం చెప్పారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జెసి చేసిన వ్యాఖ్యలతో బహిరంగ సభకు వచ్చిన ప్రజలు పెద్దపెట్టున కేకలు, ఈలలు, చప్పట్లు కొట్టడం విశేషం.