జాతీయ వార్తలు
జేడీయూ ఎమ్మెల్యే యాదవ్ కు షోకాజ్ నోటీసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 September 2016
పట్నా: ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ను ఎందుకు కలవాల్సి వచ్చిందీ చెప్పాలంటూ ఎమ్మెల్యే గిరిధారి యాదవ్ కు జేడీయూ షోకాజ్ నోటీసు జారీచేసింది. హత్య కేసులో చిక్కుకుని 11 ఏళ్లపాటు జైలులో ఉన్నఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ శనివారం బెయిలుపై విడుదలైన సందర్భంగా స్వాగతం పలికేందుకు జేడీయూ ఎమ్మెల్యే గిరిధారి యాదవ్ భగల్పూర్ జైలుకు వెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జేడీయూ పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు జారీచేసింది. బెయిలుపై విడుదలైన షాహబుద్దీన్ వంద కార్ల కాన్వాయ్తో పైసా కూడా చెల్లించకుండా టోల్గేట్ దాటి వెళ్లడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.