శ్రీకాకుళం

అన్ని వర్గాల వారికి అండగా ప్రభుత్వం: ‘కళా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం, డిసెంబర్ 25: అన్ని వర్గాల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అల్లివలస గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించారు. వీరికి ప్రభుత్వం నుండి ఐఏవై ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అదే విధంగా దేవరాపల్లి, బంటుపల్లి గ్రామాల్లో చంద్రన్న కానుక పథకంలో భాగంగా క్రైస్తవులకు ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల వారు పండగలు ఆనందోత్సవాల మధ్య చేసుకోవాలని హిందూ, ముస్లిం, క్రైస్తవులకు రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రధానంగా ప్రస్తుతం తోటపల్లి కాలువల ద్వారా నీరు రావడం వల్ల రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి చెరువులు పంటలతో ఈ ప్రాంతం కళకళలాడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి గొర్లె విజయకుమార్‌నాయుడు, టిడిపి నాయకులు ఎన్. ఈశ్వరరావు, డిజిఎం ఆనందరావు పాల్గొన్నారు.