తెలంగాణ

కాళేశ్వరం పూర్తయితే ఏడాదికి రెండు పంటలు : హరీశ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్‌లో ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చని, తద్వారా కరీంనగర్‌ మరో కోనసీమగా మారుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని తెలిపారు. రైతుల కోసం రూ.1,024 కోట్లతో గోదాములు కడుతున్నట్లు, మార్కెట్‌ యార్డులు, శీతల గిడ్డంగులు నిర్మిస్తున్నామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు.