జాతీయ వార్తలు
బిహార్లో కల్తీ మద్యం తాగి 13 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 August 2016
పట్నా: బిహార్లోని గోపాల్గంజ్ జిల్లా హరాఖువా గ్రామంలో కల్తీ మద్యం తాగి 13మంది మృతి చెందారు. సోమవారం స్థానిక దుకాణాల్లో కొందరు కూలీలు కల్తీ మద్యం తాగారు. మంగళవారం సాయంత్రం చాలామంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవ్వగా వారిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 13మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్కుమార్ దీనిపై స్పందిస్తూ ముగ్గురితో విచారణ కమిటీ నియమించామని తెలిపారు. మరణాలకు కారణం కల్తీ సారానే అని ఇప్పుడే చెప్పలేమన్నారు. కల్తీ మద్యం ఎవరూ విక్రయించలేదని స్థానిక అధికారులు అంటున్నారు.