శ్రీకాకుళం

మహిళలను అగౌరవపరుస్తున్న బాబు ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, మార్చి 7: చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మహిళలను అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తోందని వైసిపి మహిళామహిళా విభాగం రాష్టక్రార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వరుదు కల్యాణి ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్ మహిళా టీచర్‌పై వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని దీనిని ఖండించాల్సిన మంత్రే తనయుడిని సమర్థించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తనయుడు తప్పుచేస్తే ఇందులో వైసిపి అధినేత జగన్ హస్తం ఉందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజానికే సిగ్గుపడేలా ఉందన్నారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్ పై దాడి చేసిన తీరు మహిళలపట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న వైఖిరి ఏమిటోఅర్థం అవుతుందని కల్యాణి పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాసన సభను సైతం అగౌరవపరిచే విధంగా ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. మహిళలపై వేదింపులు, ప్రేమోన్మాద ముసుగులో దాడులు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని మహిళలంతా సంఘటితమై ప్రభుత్వ తీరుపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.