జాతీయ వార్తలు

కన్నయ్యను కాల్చి పారేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మరో విద్యార్థి ఉమర్ ఖలీద్‌లు ఈ నెలాఖరులోగా దిల్లీని విడిచిపెట్టి వెళ్లకపోతే దుర్గాష్టమి (వచ్చే నెల 8)లోగా వారిని హతమారుస్తామని యుపికి చెందిన నవ్ నిర్మాణ సేన అనే రాజకీయ పార్టీ తన ఫేస్‌బుక్ పేజీలో హెచ్చరించింది. దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడినందున కన్నయ్య, ఉమర్‌లను చంపేయడమే సరైన చర్య అని నవ్ నిర్మాణ్ సేన అధ్యక్షుడు అమిత్ జానీ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో ఈ హెచ్చరికలకు ఒక్కరోజులోనే రెండువేల ‘లైక్’లు రావడం గమనార్హం. ఈ ఇద్దరిని కాల్చి చంపకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దుర్గాదేవి పట్ల అనుచితంగా మాట్లాడినందున వీరిని దుర్గాష్టమిలోగా అంతం చేస్తామని అమిత్ హెచ్చరించారు.