జాతీయ వార్తలు

సుప్రీంకోర్టుకు అబద్ధాలు : ఖర్గే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం క్లీన్ చిట్ పొందేందుకు సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంటులో కాగ్ నివేదికను సమర్పించినట్లు, పీఏసీ దానిని పరిశీలించినట్లు అబద్ధాలు చెప్పిందన్నారు. కాగ్ నివేదిక బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్నట్లు తెలిపిందన్నారు. పీఏసీకి కాగ్ నివేదికను ఎప్పుడు సమర్పించారో చెప్పాలని అడగడానికి అటార్నీ జనరల్ కే కే వేణుగోపాల్‌ను, కాగ్ రాజీవ్ మహర్షిని పిలవాలని, వారికి సమన్లు జారీ చేయాలని పీఏసీని కోరుతామని చెప్పారు.