జాతీయ వార్తలు
కర్నాటకలో యథాతథ స్థితికి సుప్రీం ఆదేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 July 2019
న్యూఢిల్లీ: కర్నాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేలు, స్పీకర్ వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. అసమ్మతి ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాజీనామా ఆమోదం, అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం కోర్టు స్పీకర్ను ఆదేశించింది. ఇందులో పరిశీలించాల్సిన అంశాలు చాలా ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి చర్య తీసుకోవద్దని ఆదేశించింది. కాబట్టి కర్నాటకలో యథాతథ స్థితిని కొనసాగాలని కోర్టు ఆదేశించింది. వచ్చే మంగళవారం అంటే జూలై 16న తదుపరి విచారణ ఉంటుందని పేర్కొంది.