జాతీయ వార్తలు

కరోనా కేసులు 168

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బుధవారం నాటికి 158గా ఉన్న కరోనా కేసులు గురువారం ఉదయం 10 గంటల వరకు ఆ సంఖ్య 168కి చేరింది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 13,316 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లండన్‌ నుంచి హర్యానా చేరుకున్న ఓ యువతికి గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో రెండేసి చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మొత్తం 13 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.