జాతీయ వార్తలు
ఔరంగజేబు ఇంటికి వెళ్లిన సీతారామన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 June 2018
శ్రీనగర్: ఉగ్రవాదుల చేతుల్లో హతమైన ఆర్మీ జవాను ఔరంగజేబు కుటుంబసభ్యులను బుధవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ కు ఆమె వెళ్లారు. ఆమెతో పాటు భారతీయ ఆర్మీకి చెందిన హై ర్యాంక్ అధికారులు, పోలీసులు కూడా ఔరంగజేబు ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులకు జవాను మృతి పట్ల సీతారామన్ సంతాపం తెలిపారు. హంతకులను శిక్షిస్తామని ఆమె కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ అమరుడి ఇంటికి వెళ్లాను, ఓ కుటుంబాన్ని కలిశాను, ఆ కుటుంబం దేశానికి ప్రేరణగా నిలుస్తోందని మంత్రి సీతారామన్ అన్నారు.