జాతీయ వార్తలు

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ క‌శ్మీర్ ప్రాంతంలో పాక్ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయ‌ని, సెక్యూర్టీని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్ర‌భుత్వ‌మే ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల అంశంలో నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. క‌శ్మీర్ ప్ర‌జ‌ల కోసం మొబైల్ మెడిసిన్ వ్యాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయ‌న్నారు. పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌, ఎల్‌పీజీ, బియ్యం కావాల్సినంత ఉన్న‌ట్లు తెలిపారు. క‌శ్మీర్‌లో 22 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యాపిల్స్‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.