జాతీయ వార్తలు

కర్ణాటక, తమిళనాడులో భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దశాబ్దాలుగా సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బెంగళూరు వ్యాప్తంగా 15వేల పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. తమిళనాడు-కర్ణాటక మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు.