జాతీయ వార్తలు

ఆస్తులమ్మేసి జనం బాధలు జయ తీర్చాలి :ఖుష్బూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెకున్న కోట్లాది రూపాయల ఆస్తులను అమ్మేసి జనం బాధలు తీర్చవచ్చు కదా!.. అని కాంగ్రెస్ ప్రచారకర్త, సినీనటి ఖుష్బూ అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంచీపురం జిల్లా మధురవాయల్‌లో జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్‌లో వరదలు వచ్చినపుడు మధురవాయల్ నియోజకవర్గ ప్రజలను జయలలిత ఆదుకోలేదని ఖుష్బూ ఆరోపించారు. ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వానికి చేతకానపుడు జయలలితే తన ఆస్తులను విక్రయించి జనం బాధలు తీర్చవచ్చుకదా? అని ఆమె వ్యాఖ్యానించారు.