తెలంగాణ

1,300 టిఎంసీలను వాడుకుని తీరతాం:కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల నుంచి గతంలో కేటాయించిన విధంగానే 1,300 టీఎంసీల నీటిని ఆరునూరైనా వాడుకుని తీరతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు 1,300 టిఎంసీలను కేటాయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారని, నీటి పంపకాలపై ఎపిలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అనుకున్నవిధంగా పూర్తిచేసి తెలంగాణలో నీటికొరత లేకుండా చేస్తామన్నారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం గోదావరిపై కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తామన్నారు.